19న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు జరిగే మాదిగ డప్పుల దండోరాను జయప్రదం చేయండి.

.

తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటి గోపి మాదిగ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14(జనంసాక్షి):

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 8సం రాలు అయినా కూడా ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం లేదు కాబట్టి మహా ఎంఆర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ్ రావు మాదిగ,తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ,తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ఈ నెల 19న మాదిగ డప్పుల దండోరా తో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని కావునా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటి గోపి మాదిగ పిలుపునిచ్చారు.