20 వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శనివారం తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు సమ్మె కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి,వీఆర్ఏ మండల అధ్యక్షుడు పుర్ర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్, బూడిద వెంకటేష్  వెంకట్ రాములు తిరుమల్ గౌడ్, గోవిందమ్మ ,తిమ్మమ్మ ,నర్సన్న, రాముడు,నామాల వినోద్, అశోక్ ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా  వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ వంగూరు రాములు, సందర్శించి సంఘీభావం తెలిపారు.