23న నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శన 28 కి వాయిదా జిల్లా కలెక్టర్ జి.రవికుమార్

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నెల 23 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ పై నిర్వహించదలచిన డ్రోన్ ప్రదర్శనను ఈ నెల 28 కి వాయిదా వేసినట్లు శనివారం జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా డ్రోన్ లు ఆకాశంలో ఎగర లేవని ,అందువల్ల డ్రోన్ ప్రదర్శన తేదీనీ మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రజలు , ముఖ్యంగా పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు . ప్రదర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు . ఈనెల 28 న సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు