247 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

కోల్‌కత్తా: భారత్‌తో జరగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం ఇక లాంఛనమే కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌటౌ అయింది. 9 వికెట్ల నష్టానికి 239 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఈరోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా కేవలం 8 పరుగులు మాత్రమే జోడించింది. అశ్విస్‌ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 41 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.