26/11 తరహా దాడులకు ఉగ్రవాదుల కుట్ర

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 26/11 తరహా దాడులకు లష్కర్ ఈ తోయిబా పాల్పడనున్నట్లు ఐబీ హెచ్చరికలు జారీచేసింది. హోటళ్లు, రైల్వే స్టేషన్లు లక్ష్యంగా రెండు మూడు నెలల్లో లష్కర్ ఈ తోయిబా దాడులకు యోచిస్తున్నట్లు ఐబీ పేర్కొంది. సుమారు 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.