29న వైకాపా ఎంపిల రాజీనామాలపై నిర్ణయం
స్వయంగా హాజరు కావాలని ఎంపిలకు స్పీకర్ లేఖ
న్యూఢిల్లీ,మే22(జనం సాక్షి): వైసీపీ ఎంపీల రాజీనామాలపై లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 29న లోక్సభ స్పీకర్తో వైసీపీ ఎంపీలు భేటీ కాబోతున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వైసీపీ ఎంపీలు స్పీకర్ను కోరారు. దాంతో సుమిత్రా మహాజన్ను వ్యక్తిగతంగా కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ ఆఫీసు నుంచి లేఖ వచ్చింది. ఈనెల 29 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎంపీ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ¬దా కోరుతూ వైసీపీ ఎంపీలు ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించారు. దీంతో ఎంపిలతో స్పీకర్ నేరుగా చర్చించనున్నారు. ఈనెల 29న వైసీపీ ఎంపీలతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పీకర్ కార్యాలయంలో భేటీ కానున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వైసీపీ ఎంపీలు స్పీకర్ను కోరారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ను వ్యక్తిగతంగా భేటీ కావాలని వైసీపీ ఎంపీలకు తాజాగా స్పీకర్ కార్యాలయం ఈ-మెయిల్ పంపింది. ఈనెల 29న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సమావేశం కావాలని ఈ-మెయిల్లో పేర్కొన్నారు. రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఆహ్వానిస్తే ఎప్పుడైనా సిద్ధమని ఇటీవలే వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. దీంతో జూన్ 1న సుమిత్రాతో భేటీ కావాలని ఈ నెల 19న స్పీకర్ కార్యాలయం నుంచి వైసీపీ ఎంపీలకు లేఖ వచ్చింది. ఆ తరువాత స్వల్ప మార్పులతో 29న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ వైసీపీ ఎంపీలకు ఆదేశాలు జారీ అయ్యాయి