*40వ, రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా  మద్దూర్ మండలంలోని
తాసిల్దార్ కార్యాలయం ముందు అన్ని గ్రామ VRAలు  తమ సమస్యలను పరిష్కరించాలని 40వ రోజు  నిరవధిక సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ  ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్,మరియు అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు,55 సం. పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం పెన్షన్ ఇవ్వాలని మద్దూర్ మండల వీఆర్ఏ లు డిమాండ్ చేశారు. వీఆర్ఏ ల నిరవధిక సమ్మె ఈరోజుకు 40 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.