42వ డివిజన్లో సి సి రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ .

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 27(జనం సాక్షి)
          42వ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి గాను దశలవారీగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, ఇందులో ప్రజలందరూ వారి వారి సలహాలను, సూచనలను అందిస్తూ భాగస్వాములు కావాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ కోరారు.
           శనివారం రోజున 42 వడివిజన్ ఉర్స్ రోడ్ ఆదర్శనగర్ లో కార్పొరేషన్ జనరల్ ఫండ్ నిధులనుండి 21 లక్షల రూపాయలతో మంజూరైన . రోడ్డు పనులను కార్పోరేటర్  చందన పూర్ణచందర్ ప్రారంభించినారు.
          ఈ సందర్భంగా  చందన పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ యొక్క కాలనీవాసులు ఎన్నో రోజులుగా గుంతలమయంగా మారిన రోడ్డు వలన ఇబ్బందులు పడుతున్న దానిని స్థానిక కాలనీ ప్రజల సూచన మేరకు ఈ యొక్క ప్రాంతంలో సిసి రోడ్డును మంజూరు చేయించామని అన్నారు.
           ఈ కార్యక్రమంలో దామెరకొండ కరుణాకర్, ముత్తినేని రామమూర్తి, బక్కి భద్రయ్య, బక్కి రజిని సతీష్, వలుపదాసు కృష్ణ, మునుకుంట్ల ఐలయ్య, కొంతం ఉప్పలయ్య, బజ్జురి సత్యం, దామెరకొండ రాజు, శివారపు సాంబయ్య, జాఫర్, యాకూబ్ పాషా, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు.