42 వడివిజన్లో 13వ రోజు పట్టణప్రగతి – కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్

వరంగల్ ఈస్ట్, జూన్ 15(జనం సాక్షి):
              పట్టణప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున గ్రేటర్ వరంగల్ 42 వడివిజన్లో కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ఆధ్వర్యంలో 13వ రోజు పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం పట్టణ ప్రగతి దోహదపడుతుందన్నారు.
          ఈ కార్యక్రమంలో డివిజన్ స్పెషలాఫీసర్ రవిరాజ్, సీ.ఓ. ప్రవీణ్, స్థానిక పెద్దలు దామెరకొండ కరుణాకర్, ముత్తినేని రామమూర్తి, కన్నెబోయిన కుమార్ యాదవ్, ఇట్టబోయిన ప్రసాద్, పార్సి రత్నాకర్, మున్సిపల్ జవాన్ ఖలీం, మెప్మా కు చెందిన ఆర్. పి. లు కవిత, రమాదేవి, రమ, సురేఖ, భార్గవి, శ్రీకల, మహేశ్వరి, అనిత, శానిటేషన్ సిబ్బంది మరియు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.