56వ రోజు చేరిన వీఆర్ఏల సమ్మె

 మల్దకల్ సెప్టెంబర్ 18 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని విఆర్ఓ సమ్మె ఆదివారం నాటికి 56వ రోజు చేరింది.నిరవధిక సమ్మె లో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటివంటి హామీలను నెరవేర్చాలని వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు బి.రాములు, జిల్లా కన్వీనర్ మహేష్,వెంకటేష్,.తదితరులు చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షుడు పుర్ర లక్మన్న ఉపాధ్యక్షుడు నర్సింహులు,కమిటీ సభ్యులు శంకర్ ,ఆంజనేయులు,అశోక్, ఈరన్న ,ఎల్లప్ప ,కిష్టన్న ,వివిధ గ్రామాల పిఆర్ఏలు  పాల్గొన్నారు.