572 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న  తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 572 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీన్‌పై 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్‌ ధోని 224, కోహ్లీ 107, సచిన్‌ 81, పుజారా 44, కుమార్‌ 38, జడేజా 16, హర్భజన్‌ 11, విజయ్‌ 10 పరుగులు చేశారు. ఆసీన్‌ బౌలర్లలో పటిన్సన్‌ 5, లైయాన్‌ 3 వికెట్లు తీయగా… సిడిల్‌, హెన్నిక్స్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు  తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 380 పరుగులకు ఆలౌట్‌ అయింది.