58వరోజు చేరిన వీఆర్ఏల సమ్మె

మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 58 వ రోజు  నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు మంగళవారం మల్దకల్ మండలతహశీల్దార్ కార్యాలయం ముందు 58 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. విఆర్ఏ లకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలి.
అర్వత కలిగిన విఆర్ఏ లకు ప్రమోషన్స్ కల్పించాలి. 55 సంవత్సరములు నిండిన విఆర్ఏ ల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్బంగా వ్యక్తపరుస్తూ వారి ప్రధాన డిమాండ్లను(ముఖ్యమంత్రి హామీ లు) అమలుచేయాలని సీఎం కెసిఆర్ ను కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షుడు లక్ష్మన్న, ఉపాధ్యక్షుడు నరసింహులు, కార్యదర్శి వెంకటేష్ సభ్యులు ఆంజనేయులు,తిమ్మన్న, హనుమంతు,నాగార్జున, శంకరన్న ,రంగస్వామి, భీముడు, నామాల వినోద్, తిమ్మమ్మ, లక్ష్మి, సోమేశ్వరమ్మ, దేవమ్మ, మునెమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area