60వ రోజుకు చేరిన విఆర్ఎ నిరవధిక సమ్మె నిరసన…

వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్22(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు వెంకటాపూర్ మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు  ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి  3హామీలు పే స్కేల్ జీవో మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఫిబ్రవరి 24 2017 న రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల కమిటీతో మొదటిసారిగా ప్రగతిభవన్లో హామీ ఇచ్చారు మరియు సెప్టెంబర్ 9 2020 అసెంబ్లీ చట్టసభలో రెండవసారి రెవెన్యూ చట్టం చేస్తూ వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. మరియు మార్చి 18 2022 తేదీనకూడా మూడవసారి వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది.ఇట్టి హామీని నెరవేర్చి జీవోలను విడుదల చేసేంతవరకు శాంతియుతంగా ఈ నిరవధిక సమ్మెను ముందు కు కొనసాగిస్తాము.గురువారం రోజున ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 60వ రోజుకు చేరింది.ఇట్టి 60వ రోజు నిరవధిక సమ్మె నిరసనలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య వెంకటాపూర్ మండల వీఆర్ఏల అధ్యక్షుడు నక్క శశి కుమార్ఉపాధ్యక్షుడు తొగరి మురళి, ప్రధాన కార్యదర్శి మంతెన స్వప్న,కిషన్,శంకర్ సరిత,సునీత, కుమారస్వామి,రాయమల్లు,బిక్షపతి, సమ్మక్క,వీరస్వామి,కిరణ్,శ్రీ,భాస్కర్ రాజమౌళి మరియు మండల విఆర్ఎల్ అందరూ ఇట్టి సమ్మెలో పాల్గొన్నారు.