633 మందిని తరలించాం – జై శంకర్..

ఢిల్లీ : ఇప్పటి వరకు నేపాల్ నుండి 633 మందిని తరలించినట్లు విదేశాంగ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామని, 35 బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేపాల్ లో సహాయక చర్యల్లో పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని, 13 మిలటరీ వాహనాలు, 3 పౌర విమానాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రెండు టన్నుల మెడిసిన్లను నేపాల్ కు పంపించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ప్రతి ఫోన్ కు, మెయిల్ కు మా వద్దనున్న సమాచారం ఇస్తామని జై శంకర్ తెలిపారు.