ప్రధానితో దిగ్విజయ్‌సింగ్‌ సమావేశం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం. సీఎం, డిప్యూటీ సీఎం, బొత్సలతో చర్చించిన సారాంశాన్ని ప్రధానికి ఆయన నివేధించినట్లు తెలుస్తుంది.