ప్రకటనతో కాదు బిల్లు పెడితేనే సంబరం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) :

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సిఫార్సు చేయడంతోనే తృప్తి పడబోమని, పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే సంబరమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగ ళవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో కీలకమైన మైలురాయిని దాటామని అన్నారు. సుదీర్ఘపోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏకగ్రీవంగా నిర్ణయిం చిందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, బిల్లు ఆమోదం పొందితేనే తెలంగాణకు పండుగని అన్నారు. తెలంగాణ ప్రక్రియ ఆచరణలోకి తీసుకువచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు, రైతులు, యువత, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.