ప్రమాణ స్వీకారం చేసిన కనిమొళి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ సభ్యురాలిగా డీఎంకే పార్టీ నేత కనిమొళి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. గత కొంత కాలం నుంచి ఆమె 2 జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపిన విషయం విదితమే.