లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగుతుంది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి పేర్లను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్‌ ఈ సమావేశంలో కోరింది. సభ్యుల పేర్లను సభలో ప్రస్దావిస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తామని భాజపా, ఇతర పార్టీలు స్పష్టం చేశాయి.