భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

జలియన్‌ వాలా బాగ్‌లో నేలరాలిన ధీరమాత

‘షహీద్‌’ ఉమర్‌ బీబీ

(1864-1919)

మాతృభూమిని విముక్తి చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పరాయి పాలకుల మీద విజృంభించిన ఘట్టాలలో పురుషుల తోపాటు స్త్రీలు కూడా సాహసోపేత భాగస్వామ్యం వహించారు. ఈ మేరకు సాగిన అహింసాయుత పోరాటాలలో పాల్గొనిన బ్రిటిష్‌ పోలీసుల హింసకు ప్రాణాలను అర్పించిన అమరజీవుల జాబితాలో ఉమర్‌ బీబీ అరుదైన స్థానం సంపాదించుకున్నారు.

పౌరుషానికి పోతుగడ్డ, ధైర్యసాహసాలకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచిన పంజాబ్‌ రాష్ట్రం లోని అమృత్‌సర్‌ జిల్లా దుల్లా గ్రామంలో ఉమర్‌ బీబీ 1964లో జన్మించారు. బానిస బ్రుతకును సహించలేని రైతుకుటుంబంలో పుట్టిన ఆమె స్వతంత్ర భావాలను అలవర్చుకున్నారు. ఆమెకు ఇమానుద్ధీన్‌తో వివాహం జరిగింది. (ఖీతీవవసశీఎ వీశీఙవఎవఅ్‌ aఅస Iఅసఱaఅ వీబరశ్రీఱఎ, ఝఅ్‌ఱఎశీఅవ తీaవ, ూూన, చీవష ణవశ్రీష్ట్రఱ, 1983)

మాతృభూమి పట్ల అపార గౌరవాభిమానాలు గల మహిళ ఉమర్‌ బీబీ. జాతీయ ఉద్యమ విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుకూలాంశాలకు ఆనందం, ప్రతికూల అంశాల పట్ల బాధను వ్యక్తం చేస్తూ వచ్చారు. స్వదేశీయుల మీద విరుచుకుపడుతున్న బ్రిటిష్‌ పోలీసుల దాష్టికాలను జ్వలిత నేత్రాలతో గమనిస్తూ ఆవేదన చెందారు. మాతృభూమిని బానిస బంధనాల నుండి విముక్తం చేయ డానికి భారతీయులు సాగిస్తున్న పోరాటాలను అణిచివేసేం దుకు బ్రిటిష్‌ పాలకులు అనుసరిస్తున్న క్రూరవిధానాల మూలంగా దేశం లో అల్లకల్లోల పరిస్థితి నెలకొనియున్న తరుణంలో ఆమె జీవిత సహచరుడు కన్నుమూశారు. భర్తను కోల్పోయిన ఆమె సంసారం ఒడిదుడుకులకు గురయ్యింది.

ఆర్థిక కష్టనష్టాల కడలిలో పయనం సాగిస్తున్నాకూడా ఉమర్‌ బీబీ జాతీయోద్యమ కార్యక్రమాల పట్ల తమకున్న ప్రత్యేక ఆసక్తిని కోల్పో లేదు. ఆనాడు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల ను తెలుసుకుంటూ ఉద్యమకారుల ఉత్సాహానికి ఆనందిస్తూ ఉద్యమ కారులను తన బిడ్డలుగా భావిస్తూ ప్రోత్సహిస్తూ ఆశీర్వదిం చారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ నాయకు ల సభలకు హాజరుకాసాగారు. ఆ నాయకుల, విప్లవయోధుల ప్రసం గాలను శ్రద్దగా వినేవారు. ఆ సభలు-సమావేశాలకు ఆసక్తి దాయకంగా వివరించటం అలవాటు.

ప్రథమ ప్రపంచ యుద్ధంలో భారతీయుల అండదండలు, మద్దతు సంపాదించటం కోసం బ్రిటిషు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిం ది. యుద్ద సమయంలో పంజాబు నుండి అత్యధికులను భారత సై న్యంలో చేర్చుకుంది. ఈ మేరకు అటు  ప్రజలకు ఇటు భారతీయ సైనికులకు పలు హామీఉ ఇచ్చింది. ప్రపంచ యుద్ధం తరువాత తా ను ప్రకటించిన హామీలను, కల్పిస్తానన్న అవకాశాలను ప్రభు త్వం తుంగలో తొక్కింది. ప్రభుత్వం తన హామీలను చేసిన వాగ్ధానా లను నిలబెట్టుకోవాలిసందిగా ప్రజలు డిమాండ్‌ చేశారు. ప్రజల డిమాం డ్‌లను ప్రభుత్వం పట్టించుకోకపోగా అలనాటి హామీలను ప్రస్తావిం చిన ప్రజల మీద విరుచుకుపడింది. ఈ రకమైన నమ్మక ద్రోహం కారణంగా పంజాబుల్లో విప్లవ కార్యకలాపాలు ఊపందు కున్నాయి.

ఈ వాతావరణంలో 1918 ఆగస్టులో అమృత్‌సర్‌లోని డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ, ఆయన భార్య సాదత్‌ బానో కిచ్లూల నేతృత్వంలో ముస్లిం జనసముదాయాల నిరసన సభ జరిగింది. ఈ సభలో వక్తలు బ్రిటిషు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక చర్యల మీద విరుచుకుపడ్డారు. ఈ వాతావరణం క్రమంగా పంజాబు దాటి దేశవ్యాప్తం కాసాగింది. ప్రజల నుండి వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాన్ని అణిచివేతక ఉద్యమిస్తున్న సాయుధ విప్లవకారులను నిరోధించేందుకు, దేశ వ్యాప్తంగా వ్యక్తమౌతున్న నిరసన జ్వాలలు వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంగ్ల ప్రభుత్వం 1919 మార్చిలో భయంకర రౌలట్‌ చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ద్వారా అధికారుల విశేషాధికారాలు కల్పించింది. పౌర హక్కులను కాలరాయడానికి, విచారణ లేకుండా ఎవరినైనా నిర్భంధించడానికి అవసరానికి మించిన అసాధారణ అధికారాలు పోలీసులకు లభించాయి. ఈ చట్టం క్రింద అనుమానితులు ఎవరినై నా, ఎక్కడైనా పోలీసులు, సైన్యాధికారులు అరెస్టు చేయవచ్చు. ఆ విధంగా అరెస్టు అయిన వారెవ్వరికీ బెయిలు లభించదు. వకీలును నియమించుకునే అవకాశం ఉండదు. తన వాదన విన్పించుకునే అవకాశం ఇవ్వరు. ఆ కారణంగా రౌలట్‌ చట్టం గురించి గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, నో అప్పీల్‌-నో వకీల్‌-నో దలాల్‌ అని అన్నారు.

ఈ ప్రజావ్యతిరేక చట్టానికి నిరసనగా సత్యాగ్రహోద్యమానికి గాంధీజీ పిలుపు ఇచ్చారు. ఈ ఉద్యమానికి నాందిగా ఢిల్లీలో తొలి సత్యాగ్రహ సభ జరిగింది. ఆ తరువాత పంజాబులో సభ నిర్వహిం చేందుకు డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ తదితర నాయకుల నేతృత్వంలో మహాత్మగాంధీని ఆహ్వానించారు. ఆయన రాకను నిరోధించేందుకు ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు పంజాబ్‌ ప్రజలు తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో అత్యంత క్రూరుడిగా పే ర్గాంచిన జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలో సాగుతున్న పోలీసు రాజ్యాన్ని పంజాబు నాయకులు డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఆ విమర్శలకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆ నేతలను 1919 ఏప్రిల్‌ 10న అరస్టు చేసి ప్రవాసానికి పంపింది.

ఈ చర్యతో పంజాబు జనం మరింత రెచ్చిపోయారు. ప్రియతమ నాయకులను చిడిచిపెట్టమంటూ ఉరేగింపులు జరిపారు. ఆ సంద ర్బంగా జరిగిన కాల్పులలో నలుగు మరణించారు. పలువురు గాయ పడ్డారు. ఆ సంఘటనలతో మరింత రెచ్చిపోయిన ప్రజలు నేషనల్‌ బ్యాంకులోని ఇరువురు ఆంగ్ల అధికారులను హతమార్చా రు. గంద రగోళం సృష్టించారు. ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేశారు.

ఆ సంఘటనల తరువాత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాద్‌లో నిరసన సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున వైశాలి పర్వదినం. ఆ సందర్భంగా జరుగుతున్న సభలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో జలియన్‌వాలాబాగ్‌కు తరలివచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న జనరల్‌ డయ్యర్‌ కుట్రపూరితంగా వ్యవహరించాడు. సభా కార్యక్రమాలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ఉత్తర్వులను ప్రజలు ఖాతరు చేయలేదు. జలియన్‌ వాలాబాగ్‌ ఆ రోజున జనప్రవాహంతో నిండిపోయింది. ఆ సభలో పాల్గొనేందుకు ఉమర్‌ బీబీ కూడా అమృత్‌సర్‌కు చేరుకున్నారు.

ప్రజలు భారీ సంఖ్యలో సభాస్థలికి విచ్ఛేవారు. ఈ స్పందనకు జనరల్‌ డయ్యర్‌ మండిపడ్డాడు. నిప్పుతొక్కిన కోతిలా చిందేలేశాడు. సాయుధ బలగాలను వెంటపెట్టుకుని సభాస్థలిని చుట్టుముట్టాడు. ముందుగా ఎటువంటి హెచ్చరిలు చేయకుండానే సభికుల మీద కాల్పులు జరిపించాడు. సభాస్థలి చుట్టూ ప్రహరిగోడ ఉండటం, సభాస్థలిలోకి రాకపోకలకు ఒకవైపు మాత్రమే ఉన్న ఇరుకైన ప్రవేశమార్గానికి అడ్డంగా తన సాయుధ బలగాలను మొహరించి కాల్పులు జరిపించిన డయ్యర్‌ కిరాతకత్వానికి పెద్ద సంఖ్యలో ప్రజలు నేలకొరిగారు. ఈ దుస్సంఘటనలో ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా 378 మంది మరణించగా అందులో 55 మంది ముస్లింలు ఉన్నారు. ఈ సంఖ్య సరికాదని అమరులైన వారు సుమా రుగా 1500 వరకు ఉంటారని, మూడు వేలకుపైగా గాయపడిన వారు ఉన్నారని ఆనాటి పలు వ్యక్తిగత, సంస్థాగత నివేదికలు పేర్కొన్నాయి.

భారత స్వాతంత్య్ర సమరోజ్వల చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడిన జలియన్‌వాలాబాగ్‌ దుర్మార్గంలో డయ్యర్‌ సైనిక మూకల తుపాకీ గుండ్లకు ఉమర్‌ బీబీ బలయ్యారు. ఆనాటి 55 మంది ముస్లిం యోధులలో ఒకే మహిళగా 55 సంవత్సరాల ఉమర్‌ బీబీ ప్రత్యే స్ధానం పొందారు.

ఈ మేరకు తన రుధిరధారాలతో జలియన్‌వాలాబాగ్‌ మట్టిని పునీతం చేయడం మాత్రమే కాకుండా తమ వీరోచిత పోరాటాలతో, ప్రాణ త్యాగాలతో పంజాబీలు నిర్మించిన అద్భుత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఉమర్‌ బీబీ ప్రత్యేక స్ధానం పొందారు.

నాభర్తను సింహంలా మృత్యువును స్వీకరించన్విండి…జాతి ప్రయోజనాలు, ఆత్మగౌరవాభిమానాల పరిరక్షణ విషయంలో వ్యక్తి గత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు…అంతుకు ఎవ్వరూ చింతిం చాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి                బేగం ముహమ్మద్‌ ఆలం

గాంధీజీకి వజ్రాల గాజులు అందించిన వితరణశీలి

మునీరా మజ్రుల్‌ హఖ్‌

స్వాతంత్రోద్యమంలో అవిశ్రాంతంగా పాల్గొంటూ ఉద్యమకారుడైన భర్తకు అన్ని విధాల సహకరిస్తూ, ఉద్యమ అవసరాలకు అనుగుణం గా మసలుకున్న మహిళలు జాతీయోద్యమ చరిత్రలో మనకు ఎంతో కన్పిస్తారు. ఆ కోవకు చెందిన మహిళామతల్లులలో మునీరా బేగం ప్రముఖులు.

మునీరా బేగం గుజరాత్‌కు చెందిన తయ్యాబ్జీ  కుటుంబీకురాలు. ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు జస్టీస్‌ జద్రుద్దీన్‌ తయ్యాబ్జీ మేనకోడలు, జాతీయోద్యమకారుల కుటుంబం నుండి వచ్చిన ఆమె 1917లో ప్రఖ్యాత జాతీయోద్యమకారుడు పాట్నా జమీందారి వంశస్ధుడైన మౌల్వీ మజ్రుల్‌ హఖ్‌ను వివాహమాడారు. వివాహనంతరం ఆమె భర్తతోపాటుగా జాతీయోద్యమంలో భాగస్వా మి అయ్యారు. హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషి సల్పారు.

ఆమె సంపన్న కుటుంబానికి చెందిన సర్వసంపదలను ఉద్యమకారుల కోసం త్యాగం చేసిన వితరణశీలి. నిరాడంబరంగా జీవితం సాగిస్తూ వచ్చిన ఆమె గాంధీజి అడిగినంతనే అత్యంత విలువచేసే వజ్రాలు పొదిగిన తన బంగారు గాజులను దానంగా ఇచ్చేసి ఆయనను ఆశ్చర్యచకితుల్ని చేశారు.

ఆమె త్యాగనిరతిని వివరిస్తూ, 1920 డిసెంబర్‌ 4వ తేదీన గాంధీజి తన మిత్రుడు అక్బర్‌ హైదరాబాదికి రాసిన లేఖలలో, జాతీయోద్యమంలో ఆమె పాత్ర ను వివరిస్తూ, ఆమె దాతృత్వా న్ని వర్ణిస్తూ ఎంతగానో కొని యాడారు.

ఆమె భర్త మజ్రుల్‌ సర్వ సంపదల్ని వదిలి ఫకీర్‌ జీవితా న్ని స్వీకరించి, హిందూ- ము స్లింల ఐక్యత కోసం పని చేశా రు. ఆ మార్గంలో మనీరా బేగం భర్తకు అన్ని విధాల సహకరిం చారు. ఆమె జీవితాంతం ఆదిశ గా కృషి చేశారు.

(తురవాయి భాగం రేపటి సంచికలో)