మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
` దేశంలో 2500 పార్టీలున్నాయి :మోదీ
` విస్తుపోయిన ఘనా ఎంపీలు
` ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పురస్కారం
` రాబోయే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య రెట్టిపు వాణిజ్యం
న్యూఢల్లీి(జనంసాక్షి):భరాత ప్రధానికి ఘనమైన స్వాగతం, సత్కారం లభించాయి. ఘనా అత్యున్నత పురస్కారం కూడా ప్రదానం చేసింది. రాబోయే ఐదేళ్లలో భారత్- ఘనా దేశాలు వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఘనాకు భారతదేశం కేవలం భాగస్వామి మాత్రమే కాదని.. ఇరుదేశాలు కలిసి జోడీగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయని మోదీ చెప్పుకొచ్చారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధులు, ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తోంది. ప్రధాని మోదీ, ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. ఇండియా.. ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఉగ్ర ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడిరచారు. రక్షణ, భద్రతా రంగంలో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగుతాయని మోదీ చెప్పారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సామాగ్రి సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ తెలిపారు. అటు, సంస్కృతి, సాంప్రదాయ వైద్యం తోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అనంతరం ఘనా పార్లమెంటును సందర్శించి సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ గౌరవనీయమైన సభలో ప్రసంగించడం తనకు చాలా గౌరవంగా ఉందన్న మోదీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రతినిధిగా, 1.4 బిలియన్ల భారతీయుల సద్భావన, శుభాకాంక్షలను తీసుకువచ్చానని అన్నారు. బుధవారం సాయంత్రం తన ప్రియ స్నేహితుడు, అధ్యక్షుడు జాన్ మహామా నుంచి ఘనా జాతీయ అవార్డును స్వీకరించడం హృదయపూర్వక అనుభవమని మోదీ సభకు చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లని చెప్పిన మోదీ.. మనకు, ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదన్నారు. ఇది మన ప్రాథమిక విలువలలో ఒక భాగమని చెప్పుకొచ్చారు. భారతదేశంలో 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, వివిధ రాష్టాల్రను పరిపాలించే 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని మోదీ చెప్పారు. భారతదేశానికి వచ్చిన ప్రజలను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా స్వాగతించడానికి ఇదే కారణమని ప్రధాని అన్నారు.’ఇవాళ మన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, ఘనా బిడ్డ డాక్టర్ క్వామే న్కుమ్రాకు నివాళులర్పించే గౌరవం నాకు లభించిందని’ అన్నారు. ఘనా పర్యటలో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశిష్ట రాజనీతి, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామా చేతుల విూదుగా ఘనా జాతీయ గౌరవం ’ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ పురస్కారాన్ని అందుకున్నారు. 1.4 బిలియన్ల భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పిన మోదీ.. ఈ గౌరవాన్ని భారతదేశ యువత ఆకాంక్షలు, సాంస్కృతిక, సంప్రదా యాలు, వైవిధ్యం, ఇంకా ఘనా – భారత్ మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేశారు. ఈ గౌరవాన్ని అందించినందుకు ఘనా ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశంలో పర్యటించడం తనకు లభించిన గౌరవమని హర్షం వ్యక్తంచేశారు. ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతోందని కొనియాడారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచక్రమం వేగంగా మారుతోంది. సాంకేతికతలో విప్లవం, గ్లోబల్సౌత్లో ఎదుగుదల ఆ మార్పునకు దోహదం చేస్తున్నాయి. గ్లోబల్సౌత్ గళం వినిపించకుండా ఆ పురోగతి సాధ్యంకాదు అన్నారు. 2047నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మా ప్రజలు సంకల్పంతో ఉన్నారు. బలమైన భారత్.. సుస్థిరమైన ప్రపంచానికి దోహదం చేస్తుంది. ఆఫ్రికా అభివృద్ధి దిశగా చేసే ప్రయాణంలో మా సహాయాన్ని అందిస్తాం. మన దేశాల పురోగతికి పరస్పరం సహకరించు కుందామని మోదీ పిలుపునిచ్చారు. జీ20కి భారత్ సారథ్యం వహిస్తోన్న తరుణంలోనే ఆ గ్రూప్లో ఆఫ్రికా యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందడం ఆనందకరమని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషధ తదితర రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే ప్రథమం