భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

సమాజాన్ని చదవటం, పరిణామశీలాన్ని అధ్యయనం చేయటం ద్వారా సమకాలీన పరిస్థితులన్నిటి మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకొని, ఆనాటి అమ్మాయిల తీరు తెన్నులకు భిన్నంగా మార్పు కోసం జాహిదా ఖాతూన్‌ నడుంకట్టారు. పది సంవత్సరాల వయస్సు లో పది దశాబ్దాల వయస్కురాలి పరిపక్వతను తన కవిత లలో ప్రతిఫలింప చేశారు. ఆమె క్రమంగా ఎదుగుతూ, సమాజం లోని సనాతన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయు ధంగా మలచుకుని ఉద్యమించారు. సామాజిక రుగ్మతల నిర్మూల నకు, సామాజిక సంస్కరణకు పూనుకున్నాను. స్త్రీ స్వేచ్చకు ప్రాధాన్య తను ఇచ్చారు. పురుషులతోపాటుగా స్త్రీలు కూడా స్వేఛ్చను తమ శక్తియు క్తుల మేరకు బాధ్యతలను నిర్వహిస్తూ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు.

ఆనాడు భారతీయ మహిళల పరిస్థితులను జాహిదా ఖాతూన్‌ తన కవితలలో ప్రతిఫలింప చేశారు. భారతీయ మహిళ గురించి రాద్దా మ ని నా కోరిక. నా మనసంతా ఆందోళన. పదాల్ని ఎక్కడి నుండి తేను? నా ఈ దుర్దశ పశ్చాత్తాపానికి గురి చేస్తుందే మోసన్న ఆందో ళనే ఎప్పుడూ. నా మాటలు పరాయి పదాలుగా అనిసిస్తూం టే, చెప్పనా? వద్దా? అను సందిగ్ధం..? అంటూ రాయడానికి పదాలు దొరకనంతగా మహిళల దుర్దశ ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజం పలకటం నేరంగా మారిందని తాను భారతీయురా ల్ని కావటం, ముస్లిం కావటం, నిజం పలకటం ద్వారా మరింత నేరస్థు రాల్ని అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, నేరాలకు ప్రతిరూ పాన్ని నేను. నా నేరాల్ని ఎన్నని వర్ణించనూ, ముస్లింను, భారతీయు రాల్ని, నిజం పలికేదాన్ని అన్నారు. ఈ దిశగా ఆమె రాసిన అనేక కవితలు ఆనాటి ప్రముఖ ఉర్దూ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

జాహిదా ఖాతూన్‌ స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. స్త్రీలు అక్షర జ్ఞానసంపన్నులు కావాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసేందుకు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని భావించారు. ఉత్తమ సమాజం విద్యావంతులైన తల్లుల ద్వారా రూపుదిద్దుకుంటుందని దృఢంగా నమ్మారు. స్త్రీలు విద్యావంతులు కావటమే కాకుండా పురుషులతో పాటుగా కూడా రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు రాజకీయ రంగంలో కూడా రాణించాలన్నారు. అక్షరాజ్ఞానం, రాజకీయ చైతన్యం గల మహిళలు మాతృభూమి కోసం త్యాగాలను చేయగల నాయకులను, జాతిజనులకు ఉత్తమ సేవలందించగల పౌరులను రూపొందించగలరని ప్రకటించారు. మహిళలను రాజకీయాలకు దూరంగా ఉంచిన జాతి, సమాజం వెనుకబాటు తనానికి గురవుతుందని ఆమె హెచ్చరించారు.

ఈ విషయాన్ని మరింత విస్తారంగా చెబుతూ, గొప్ప వ్యక్తుల తల్లులందరూ ఓ ప్రత్యేక మనస్తత్వం కలిగిన మహిళలని మనకు చరిత్ర తెలుపుతుంది. విజేతల తల్లులు ధైర్యవంతుల, సంస్కర్తల అమ్మలు ఆలోచనాపరులు, మహాత్ముల తల్లులు  మహీనీయులుగా మనకు దర్శనమిస్తారు. వ్యక్తిగతంగా ఒక పురుషుడి నైతికత స్త్రీ ద్వా రా రూపుదిద్దుకోవడమో లేక భ్రష్టు పట్టడమో జరుగుతుంది. ఓ జాతి నైతిక విలువలు, సామాజిక జౌన్నత్యం ఆ జాతికి చెందిన తల్లుల మానసిక స్థితుల మీద ఆధారపడివుంటాయి. రాజకీయ ఔన్న త్యాన్ని గుత్తకు తీసుకున్నామని చెప్పుకునే జాతులను మనం పరిశీ లిస్తే ఆ జాతులలోని మహిళలు రాజకీయంగా ఎంత పరిపక్వత కలిగి ఉండేవాళ్ళో వాళ్ళల్లో మాతృభూమి పట్ల ప్రేమ ఎంత పొంగి పొర్లేదో మనకు అర్థమవుతుంది. పురుషుల అస్తిత్వం తల్లి జాతికి, దేశానికి భగవంతుడు ప్రసాదించిన ఉత్తమ వరంలా రుజువయ్యిం ది, అని జాహిదా ఖాతూన్‌ షేర్వానియా అన్నారు. (భారత్‌ కే స్వాతంత్య సంగ్రామ్‌ మే ముస్లిం మహిళావోంకా యోగదాన్‌)

విద్యారంగంలో ముస్లిం మహిళల స్థాయి అధమంగా ఉన్న విషయం మీద ఆవేదన వ్యక్తం చేసిన జాహిదా ఖాతూన్‌ ఎంతో బాధపడ్డారు. ఆ స్థితి పట్ల బాధను వ్యక్తం చేయడంతో ఆమె ఊరు కోలేదు. ఈ స్థితికి గల కారణాలను కూడా ఆమె చాలా వివరంగా విశ్లేషించారు. ఈ దుస్ధితికి కొందరు ముస్లిం మత పెద్దలు కారణ మని ఆమె ఆగ్రహించారు. ఈ విషయం గురించి రాస్తూ, ముస్లిం మత పెద్దల తప్పు వొకటే, తమ స్త్రీలను చదువు సంధ్యల్లేని వాళ్ళుగా వుంచారు. లేకుంటే చదవించినా రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా వుంచారు. జాతి తల్లులలో రాజకీయ పరిజ్ఞానం లేనందున  జాతి జనులలో కూడా రాజకీయాల పట్ల సరైన అవగా హనకు ఆస్కారం లేకుండా పోయింది. అందుచేత అవమానకర మైన, దయనీయమైన ఆహారంతో కడుపు నింపుకుని ఉన్నట్టయితే మీ ఆ చేష్టలకు ముగింపు పలికి భవిష్యత్తు గురించి జాగ్రత్త వహించండి. మీ చర్యల వలన కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి మార్గం వొక్కటే. అది మీ స్త్రీలను విద్యావంతుల్ని చేయడం, విజ్ఞానార్జన ద్వారా సరైన రాజకీయ దృక్పథం, మంచి అవగాహన వారిలో కలుగచేయడం. ఆ ఆవకాశాలను వారికి కల్పించటం అని జాహిదా ఖాతూన్‌ షేర్వాని యా సలహా ఇచ్చారు.

ఆనాటి సామాజిక పరిస్థితులలో ఓ కులీన కుటుంబం నుండి విచ్చేసిన మహిళ కవిత్వం చెప్పటం మాత్రమే కాకుండా స్త్రీ విద్య కోసం, రాజకీయరంగంలో స్త్రీల ప్రవేశం కోసం పోరాడటం, ఆ రంగాలలో మహిళల వెనుకబాటుతనానికి ముస్లిం పెద్దలను బాధ్యు ల్ని చేయటం, ఆ పెద్దల చర్యలను తప్పుపట్టడం, ఆ తప్పులను దిద్దు కోవాల్సిందిగా పెద్దలకు సలహా ఇవ్వటం నిజంగా సాహసం.

ఈ మేరకు తాను నమ్మిన విషయాన్ని స్పష్టంగానూ, ధైర్యంగానూ ప్రకటించటంలో ఆమె ఏనాడు వెనుకాడలేదు. ముస్లిం మహిళలు ధరిస్తున్న పర్ధా విధానం సరైనది కాదంటూ, డాక్టర్లు అంటున్నారు బంధనాల నుండి బయట పడండి – గాలిని ప్రవేశింపనివ్వండని, సంకుచిత స్వభావులు అంటున్నారు. ససేమిరా వద్దు చావనివ్వం డని, ఓ కవితలో అన్నారు. జాహిదా పర్దా పద్దతికి పూర్తిగా వ్యతిరేకం కాకున్నా అనారోగ్య హేతువైన రీతిలో పర్దాను ధరించ డాన్ని మాత్రం వ్యతిరేకించారు.

విద్యాభ్యాసం పట్ల అధిక మక్కువ చూపిన ఆమె జ్ఞానార్జనకు విద్యాభ్యాసం మాత్రమే మార్గమని భావించినందున అందుకు వ్యతిరేకాంశాలతో ఏమాత్రం ఏకీభవించలేదు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం గ్రాంటులతో నడుస్తున్న విద్యాల యాలను విడిచి విద్యార్థులు బయటకు రావాలని మహాత్మ గాంధీ పిలుపునిచ్చినప్పుడు ఆనిర్ణయం ఆమెకు నచ్చలేదు. విద్యాభ్యాసం చేయాల్సిన విద్యార్థులు విద్యాలయాలు బహిష్కరిస్తే వారి చదువు ఎలా సాగుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ, సహాయ నిరాకరణోద్యమం ఆచరణలోని కొన్ని అంశా ల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఉద్యమంలో భాగంగా చదువులు మాన ేయడం నాకిష్టం లేదు, అని బాహటంగా కళాశాలల బహిష్కరణకు ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు.

చిత్తశుద్ది కరువైన స్వార్థపూరిత రాజకీయాలు, ఆ మార్గాన నడిచే రాజకీయ నాయకుల  చర్యల పట్ల కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాజకీయ నాయకులు జనాన్ని తమ గుప్పిట్లో ఉంచు కునే మంత్రంగా, పేరు ప్రతిష్టల్ని పొందే చిట్కాగా, వెండి బంగా రాన్ని సమకూర్చి పెట్టగల ఊటబావిలా భావించి రాజకీయాల్ని స్వీక రిస్తున్నారు. ఆ కారణంగా విశ్వమానవాళి హృదయాల నుండి మన స్థానం దిగజారిపోతుంది. అంటూ స్వార్థపరులైన రాజకీయ నాయ కుల వ్యవహార సరళి మీద ఆమె అక్షరాయుదాంతో విరుచుకు పడ్డా రు. ఆనాడు ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఈనాటి రాజకీ యా లకు కూడా వర్తించటం ఆమెలోని దార్శనికతకు అద్ధం పడుతుంది.

స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగుతున్న జాతీయోద్యమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. ఉద్యమించ మని మహిళలను స్వయంగా కోరారు. ప్రజలకు స్వతంత్ర జీవన అవకాశాలను కల్పించుందుకు స్వాతంత్య్రసమంరలో కలిసకట్టుగా పాల్గొనాలని జాహిదా ఖాతూన్‌ ఉద్భోధించారు. మతాలకు అతీతం గా ప్రతి ఒక్కరు ఉమ్మడిగా ముందుకు సాగాలని సూచించా రు. హిందూ-ముస్లింల ఐక్యత అత్యంత ఆవశ్యం అన్నారు. ఆయా జనసముదాయాల మధ్యన అపార్థాలను దూరం చేసి సద్భావన, సదవగాహన ఏర్పరిచేందుకు జాహిదా ఖాతూన్‌ నిరంతరం శ్రమించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన ప్రతి ఉద్యమం, సంఘటన మీద జాహిదా ఖాతూన్‌ షేర్వానియా కవితలు రాశారు. అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాల్కన్‌ యుద్ధం, ప్రథమ ప్రపంచ యుద్ధం, జలియన్‌వాలాబాగ్‌, కాన్పూరు మసీదు కేసు తదితర దుస్సంఘటనల మీద ఆమె తనవైన కవితలతో ప్రతిస్పందించారు. ఈ మేరకు తమ కవితలతో బ్రిటిషు ప్రభుత్వ చర్యల మీద విమర్శనాస్త్రాలు సంధించిన కవయిత్రిగా ప్రజల మనస్సులలో మాత్రమే కాకుండా స్వాతంత్రోద్యమం సాహిత్య చరిత్ర లో ఆమె ప్రత్యే స్ధానం కల్పించుకున్నారు.

ప్రజల మీద బ్రిటిష్‌ ప్రభుత్వం సాగంచిన ప్రతి జులుం మీద ఆమె తన కవితలతో దాడులు చేశారు. ప్రభుత్వ చర్యలను నిర్భయంగా నిరసించారు. ప్రభుత్వ చర్యల మీద విమర్శలు చేస్తున్న కవులు రాసిన కవితలను, ఆ రచనలను ప్రచురిస్తున్న పత్రికల మీద ప్రభుత్వం దాడులు చేసినప్పుడు, ఆయా పత్రికలకు, పత్రికా సంపాద కులకు ఆమె అండా నిలిచారు. జాతీయ భావాలను ప్రచారం చేస్తున్న పత్రికల మనుగడ కోసం అవసరమగు ఆర్థికతను అందించ డానికి ఎంతో శ్రమించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన పత్రికల ఆస్థిపాస్తులను అధికారులు జప్తు చేసి, పత్రికల సంపాదకులను వీధుల్లో పడేసినపుడు వారికి తగిన విధంగా స్వయంగా సహయ, సహకరాలు అందించి పత్రికా స్వేచ్ఛ పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు.

కవయిత్రిగా, సంస్కరణవాదిగా జాహిదా ఖాతూన్‌ ప్రముఖ కవి పండితుల, పాఠకుల ఆశీస్సులతో పాటుగా, ప్రజల అపార ప్రేమాభిమానాలను అందుకున్నారు. పేరు ప్రతిష్టల కోసం ఆమె ఎన్నడూ ప్రాకులాడలేదు. ఆమె ఎన్నడూ తన పేరున ప్రకటించలేదు. జాహిదా, నుజహత్‌ అను కలం పేర్లతో ఆమె కవిత్వం సాగింది. (Encyclopadia of women Biography, Ed by Nagendra , k. Singh, APHPC, New Delhi. 2001) మహిళల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం మాత్రమే కాకుండా వలసపాలకుల దుష్టపాలన నుండి ప్రజల విముక్తిని ఆకాంక్షించిన ప్రముఖ కవయిత్రిగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ప్రముఖ జాతీయోద్యమకారుల సంపాదకత్వంలో నడుస్తున్న, జమిందార్‌, ఆల్‌ హిలాల్‌, కామ్రేడ్‌ లాంటి పత్రికలతో పాటుగా ఆనాటి ఇతర ప్రముఖ పత్రికలలో కవిత్వం చోటు చేసుకుంది.

స్వేచ్ఛ, స్వాతంత్య్రేచ్చ, ప్రగతిశీల భావాలు, సంస్కరణల కోసం సాగిస్తున్న పోరాటం, ఛాందస భావాల మీద ప్రకటించిన యుద్ధం, స్వార్థ రాజకీయాల మీద ఆమె సంధించిన విమర్శనాస్త్రాల తీవ్రతను గమనించిన ప్రముఖ ఉర్దూ కవి అక్బర్‌ అల్హాబాది ఆమె కవితల గొప్పదనం గురించి మాట్లాడుతూ ఒక వేళ ఈ కవితలన ఓ మహిళ రచిస్తున్నట్టయితే ఇక కవిత్వం మీద పురుషులు తమ ఆధిపత్యం వదులుకోవాల్సిందే అని వ్యాక్యానించటం ధైర్యశాలిగా, ఉత్తమ కవయిత్రిగా ఆమె స్థాయిని, స్థానాన్ని వెల్లడి చేస్తుంది. ఆమె రాసిన కవితలలో కొన్నిAina-i-Haram, Firdus-i- Takhiyyul పేర్లతో సంకలనాలుగా ఆమె మరణాంతరం ప్రచురితమయ్యాయి. (whos who india writers, sahithya akademi New Delhi,  1961)

జాహిదా ఖాతూన్‌ కవయిత్రిగా కవితలతో ఉద్యమకారులను ఉత్తేజపర్చటం, మార్గర్శకం చేయటం మాత్రమే కాకుండా స్వయంగా ఉద్యమ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. బెంగాల్‌ విభజన, స్వదేశీ ఆందోళన, సమాయ నిరాకరణ ఉద్యమాలలో భాగస్వామ్యా న్ని అందించారు. స్వదేశీ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించారు. ఖద్దర్‌ ధరించమని ఇతరులను కోరటం మాత్రమే కాకుండా, స్వజనుల వ్యతిరేకతను ఖాతరు చేయకుండా తాను స్వయంగా ఖద్దరును ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, స్వదేశీ ఉద్యమం అంటే నాకు చచ్చేంత ప్రేమ, ఇవాళే కాదు, తొలినాటి నుంచి కూడా ఇక ప్రస్తుత సంఘటన వల్ల విదేశీ వస్తువుల పట్ల భరించలేని వ్యతిరేకత ఏర్పడింది. అసహ్యం పుట్టింది. ఒక ముదు ఎన్నడూ విదేశీ వస్త్రాన్ని కొనరాదని నిర్ణయించుకకున్నాను. అని ప్రకటించారు.

ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం మాత్రమే కాకుండా ఖద్దరు ధారణ నిమిత్తంతనకు తానుగా ఆమె ఖద్దరు ధార ణ వస్త్రాలు ఆమె ధరించలేకపోయారు. ఆ ఖద్దరు వక్రస్తాలను కొను గోలు చేశారు. ఆ దుస్తులను జీవితాంతం ధరించాలని ఎంతో ముచ్చ టపడ్డారు. దురదృష్టం ఏమిటంటే  ఆమె స్వయంగా కొనుగో లు చేసిన ఖద్దరు వస్త్రాలు ఆమె ధరంచలేకపోయారు. ఆ ఖద్దరు దుస్తు లు ఆమె మృతదేహాన్ని మాత్రమే అలంకరించాయి. ఖద్దరు వస్త్రాలు ధరించాలన్న నిర్ణయం తీసుకున్న 11 రోజులు వ్యవధిలో 1922 ఫిబ్రవరి 4న ఆకస్మికంగా తన 29 సంవత్సరాల వయస్సులో అవివాహితగా ఈమె కన్ను మూశారు.

ఆ సమయంలో ఆమె కొనుగోలు చేసిన ఖద్దరు వస్త్రా లను ఆమె సోదరుడు దావూద్‌ అహమ్మద్‌ ఖాన్‌ ఆమె భౌతికా యం మీద పరచి ఆమె అభిమ తాన్ని ఆవిధంగా గౌరవిస్తూ జాహి దా ఖాతూన్‌ షేర్వాని యా కోర్కెను నెరవేర్చారు.

(తరువాయి భాగం రేపటి సంచికలో)