70 ఏళ్ల పాలనలో తెలంగాణలో చీకట్లు నింపారు
నాలుగేళ్లలోనే తెలంగాణ నంబర్ వనచేసిన ఘతన కెసిఆర్ది
భూపాలపల్లి అభ్యర్థి మధుసూధనాచారి
భూపాలపల్లి,నవంబర్20(జనంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్,టిడిపిలు పాలించినా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ లేదని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత ఆస్తుల సంపాదించుకోవడానికి కృషిచేశారే తప్ప రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిందేవిూ లేదన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఒక్క 24 గంటల కరెంటే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలు ఎక్కడిక్కడ కరెంట్ గురించి కాంగ్రెస్ను నిలదీయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో తెలంగాణ వెనుకబాటు తనానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని పేర్కొన్నారు. మళ్లీ వారు
అధికారంలోకి వస్తే తెలంగాణకు చీకట్లు తప్పవన్నారు. ప్రజలు ఇది గమనించి టిఆర్ఎస్కే అధికారం కట్టబెట్టాలని అన్నారు. వివిధ గ్రామాల్లో ప్రజలతో ఆయన ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయానికి, తాగునీటిని అందించారని తెలిపారు. జలవనరులు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని, మన రాష్ట్రం, మన పార్టీ అనే నినాదంతో ముందుకెళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మహాకూటమి అధికారం కోసమే పొత్తులు పెట్టుకుంది, మహాకూటమి మాయాకూటమి అని, కూటమికి ఓటేస్తే రాష్ట్రం వెనుకబాటు తనానికి గురవుతుందని అన్నారు. మహాకూటమిలో ముఖ్యమంత్రి అయ్యేవారు ఎవరో దేవుడికే తెలుసని, సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారని, ఇప్పుడే ఇట్లుంటే భవిష్యత్లో వీరు కలిసుండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న భూరికార్డులను ప్రక్షాళన గావించి రైతులకు నూతన డిజిటల్ పాస్పుస్తకాలతో పాటుగా, సేద్యానికి ఎకరాకు రూ.8 వేలు చొప్పున అందించడంతో పాటు, రూ.5 లక్షలు రైతుబీమా పథకంతో రైతులకు భరోసాగా నిలిచారన్నారు. ఐక్యరాజ్యసమితిలో రైతుబంధు పథకానికి గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు గర్వించే విధంగా నిలిపిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతులకు సాగునీటిని అందిస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాలన్నారు.