మెదక్‌ ఓయూ పీజీ క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌,జనవరి 20 (జనంసాక్షి) ఉస్మానియా విశ్వవిద్యాలయం మెదక్‌ జిల్లా జోగిపేటలో కొత్తగా పీజీ కలాశాల క్యాంపస్‌ ను ప్రారంభించింది. ఈ క్యాంపస్‌ ద్వారా ఐదు పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు ఉపకులపతి సత్యనారయణ తెలిపారు. ఎంబీఎలో పాటు ఎం.ఎ ఇంగ్లీషు , ఎమ్మేస్సీ గణితం, ఎంఎల్‌ ఐఎస్‌సి కోర్సులు ఇక్కడ ఉంటాయని ఆయన చెప్పారు.ఈ క్యాంపస్‌ అభివృద్దికి రూ.26.31కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు సత్యనారయణ తెలిపారు.