ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రజలకు మెరుగైన వైద్యం అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ మంజూర్ నగర్ లో మల్టీ స్పెషాలిటీ తో కూడిన వైద్యం అందించేందుకుగాను దేవ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైద్యులు మెరుగైన సేవలు అందించాలని, అప్పుడే హాస్పిటల్ కు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని పేదలకు సేవలు అందించే అవకాశం వైద్యులకు మాత్రమే ఉంటుందని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ మధుసూదన్, డిఎస్పి సంపత్ రావు, సిఐ నరేష్ కుమార్, దేవ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ రిత్విక్, మున్సిపల్ కౌన్సిలర్ ముంజాల రవీందర్ గౌడ్, సిరుప అనిల్, అప్పం కిషన్, వివిధ ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.