బోధన్ మండలం సంఘం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ
బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం సంఘం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. పరిసరాలలో దొరికే తాజా ఆకుకూరలు, కూరగాయలు తినాలని, పోషక విలువలు కలిగిన ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలని చెప్పటం జరిగింది. గర్భిణీ గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డ పుట్టిన 2 సంవత్సర లోపు1000 రోజులు గోల్డెన్ డేస్ గురించి చెప్పటం జరిగింది. మంత్రం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆచన్ పల్లి సెక్టార్ సూపర్వైజర్ నందిని, అంగన్వాడి టీచర్లు రాధిక, సలీమ తల్లులు పాల్గొన్నారు.