రాహుల్‌జీ.. మీకోసం అశోక్‌నగర్‌లో యూత్‌ ఎదురుచూస్తున్నారు

 తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను వ్యంగ్యంగా హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో యువత ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.అలాగే యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినందుకు, టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు యువత ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. గ్యారంటీలను నెరవేర్చిన మిమ్మల్ని యువతను కలిసేందుకు హైదరాబాద్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీకి సంబంధించిన ట్వీట్‌ను ఇందులో ప్రస్తావించారు.గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌కు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులను కలిశారు. అనంతరం ఆయన ట్విట్టర్‌ వేదికగా అప్పటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌ పర్యటనతో తనకు అర్థమైందని చెప్పారు. అందుకే తెలంగాణలో ప్రజా పాలన అధికారంలోకి రాగానే ముందుగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని తెలిపారు. అలాగే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. యూపీఎస్సీ తరహాలో టీఎపీఎస్సీని పునరుద్ధరిస్తామని.. యువ వికాసం కింద ఫీజులు, కోచింగ్ ఫీజు చెల్లింపుల కోసం 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని ప్రకటించారు. రాహుల్‌ గాంధీ మోసపూరిత మాటలను నమ్మిన యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ మాత్రం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. దీనిపై ఇప్పటికే యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.