కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…

చెన్నారావుపేట, డిసెంబర్ 10(జనం సాక్షి);
అందజేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి…
మండలంలోని కోనాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మైదం రాకేష్ గెలుపును ఆకాంక్షిస్తూ రూ. 50 వేలను చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు జల్లి గ్రామానికి చెందిన తొగరు చెన్నారెడ్డి విరాళంగా అందించారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నగదును అందజేశారు.


