ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ
` ఈసీని బీజేపీ కబ్జాచేసింది
` లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను వాడుకుంటోందన్నారు. సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే తప్పు చేసినా శిక్ష అనుభవించకుండా తప్పించుకునే అవకాశాన్ని ఈసీ (%జుశ్రీవష్ఱశీఅ జశీఎఎఱంంఱశీఅ%)కి కల్పించారన్నారు. ఓట్ల చోరీకి సంబంధించి తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి మూడు ప్రశ్నలు వేశారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ఎందుకు బలహీనపడుతోంది? దాని స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా? సర్ ప్రక్రియపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్న సమయంలో.. ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ విషయంలో పారదర్శక సంస్కరణలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? భాజపాకు అనుకూలంగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలింగ్ తర్వాత 45 రోజులకు సీసీ ఫుటేజీ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలన్నీ ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిపై ఈసీ తమకు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. హరియాణా ఓటర్ల జాబితాలో బ్రెజిల్కు చెందిన మోడల్కు 23 ఓట్లు ఉన్న అంశాన్ని ఆయన మళ్లీ గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్పైనా రాహుల్ గాంధీ లోక్సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తోందన్నారు. దేశంలోని వ్యవస్థలన్నిటిపైనా ఆధిపత్యం చూపిస్తోందని విమర్శించారు.
‘ఈసీ’ని కేంద్రం కబ్జా చేసింది
ఈసీ, ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర సంస్థలను కేంద్రం కబ్జా చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్కు అనుగుణంగానే ఈసీ ఎన్నికలను నిర్వహిస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలోని అవకతవకలను బయటపెట్టామని రాహుల్ గాంధీ చెప్పారు. వారి స్వార్థం కోసం ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పించేలా కేంద్రం చట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.పోలింగ్ తర్వాత 45 రోజులకు సీసీ ఫుటేజీ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఓట్ల చోరీకి సంబంధిచిన ఆధారాలన్నీ ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటిపై ఈసీ తమకు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. హరియాణా ఓటర్ల జాబితాలో బ్రెజిల్కు చెందిన మోడల్కు 23 ఓట్లు ఉన్న అంశాన్ని ఆయన మళ్లీ గుర్తు చేశారు. మన దేశం 150 కోట్ల ప్రజలతో కుట్టిన వస్త్రమన్న రాహుల్, దాన్ని ఓట్లతో కలిపి అల్లారని చెప్పుకొచ్చారు. ఓట్ల చోరీకి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నాశనం కోసం ఈసీని బీజేపీ వాడుకుంటోందని, పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానల్ నుంచి సీజేఐను తొలగించారని వివరించారు.


