ఎడిటర్ రెహమాన్ పై కేసు ఎత్తివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి

జోగులాంబ గద్వాల (జనంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి పరిసరాల గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేయగ ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనతో ఎటువంటి సంబంధం లేని జనంసాక్షి ఎడిటర్ రహిమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు టియుడబ్ల్యూయు (ఐజేయు )ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య లు మాట్లాడుతూ పర్యావరణనికి, జలకాలుష్యనికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలను ప్రచురిస్తే జీర్ణించుకోలేని ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు పిర్యాదు తో స్థానిక పోలీసులు కక్ష పూరీతంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమయంలో జనంసాక్షి ఎడిటర్ రహిమాన్ పై అక్రమంగా కేసులు బనాయించడం సరైంది కాదని, అది ముమ్మాటికి ప్రశ్నించే వారి గొంతు నొక్కడిమేనని మండిపడ్డారు.ఎడిటర్ పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, యోగేష్ శర్మ, కూన రాజు, కైలాష్,రామొల్ల రాజేశ్వర్, జల్డ మనోజ్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు