అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ
హైదరాబాద్ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై బీఏసీ సమావేశంలో విపక్ష నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి తీర్మానంపై చర్చ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు. మొత్తం గంటలపాటు చర్చ చేపట్టనున్నట్లు చెప్పారు. అయితే వెంటనే అవిశ్వాసంపై చర్చకు తెదేపా, వైకాపా సభ్యులు అభంతరం వ్యక్తం చేశారు. అవిశ్వస తీర్మానం పెండింగ్లో పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇబ్బందిగా ఉంటుందని స్పీకర్ వారికి నచ్చజెప్పారు.