ఇప్పుడొక కొత్త ఆయుధం కావాలి

ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబో తోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతా ల గురించి ఆలోచించడం లేదు. అయినప్పటికీ వ చ్చే నెలలో పండగలున్నాయి. కాబట్టి జీతాలిప్పిం చే బాధ్యత అధికారంలో ఉన్న మంత్రులు తీసుకో వాలి. అలా జరగని పక్షంలో ఒకటో తారీఖున వా ళ్లంతా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉద్య మంలో భాగస్వాములు కావాలి. ఉద్యమం ఈ వి డత తెలంగాణ కాంగ్రెస్‌ లక్ష్యంగా కదలాలి.

మనకు ‘చీమ’ కథ చిన్నప్పటి నుంచీ తెలు సు. ‘చీమా చీమా ఎందుకు కుట్టావూ’ అని అడిగి తే ‘నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా’! అ నే సమాధానం. చీమకంటే ముందు ఏ చిన్న పి ల్లోడైనా చెప్పేస్తాడు. పాపం కిరణ్‌కుమార్‌ రెడ్డి మాత్రం ఆ కథను తిరగేసి చెప్పి చేతులు కాల్చుకు న్నాడు. అసలాయన తన కథ మొదలుపెట్టాల్సింది ‘చేపా చేపా ఎందుకు ఎండలేదని’ తెలంగాణ రైతు లు ‘తమ పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని’ ఇంకా అడగకముందే ఆయన చీమతో ప్రారంభిం చి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘సింగరేణిలో స మ్మె చేయడం వల్ల బొగ్గు పెల్ల పెగల లేదని, బొ గ్గులేక పోవడం వల్ల కరెంటు ఉత్పత్తి ఆగిందని, కాబట్టి మీ పంటలు ఎండి పోవాల్సిందే’నని ఆయ న ఇప్పుడు కథ చెపుతున్నాడు. అట్లా చెప్పగానే రై తులు, ప్రజలు సమ్మె చేస్తోన్న కార్మికుల మీదనో, విద్యుత్‌ ఉద్యోగుల మీద నో తిరగబడితే సమ్మె ఆ పేస్తారని ఆ దెబ్బతో అసలు తెలంగాణే వద్దని అం టారని పాపం ఆయన ఆశపడ్డారు.

కానీ, తెలంగాణ ప్రజలు ‘యువకిరణంలా’ రాజకీయ అనుభవం, అవగాహనలేని వాళ్ళు కా దు గదా. ఇప్పుడు ప్రజలు, ఉద్యమకారులు ఆయ న కథల్లోని నీతిని అర్థం చేసుకున్నారు. కాబట్టే చే ప దగ్గరే ఆగిపోకుండ సింగరేణి కార్మికులు సమ్మె ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నను అడుగుతున్నా రు. ఒక్క సింగరేణి కార్మికులే కాదు. యావత్‌ తె లంగాణ యివాళ ఎందుకు తిరగబడిందో తెలుసు కోమని కోరుతున్నారు. కానీ అడ్డదిడ్డంగా కథను తిప్పి అడిగిన వారిని అయోమయంలో పడేయాల న్నది ఆయన ప్లాన్‌. రెండువారాలుగా సాగుతున్న సమ్మెతో సకల జనులు ఈ ప్రభుత్వానికి ముచ్చెమ టలు పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పొలాలు ఎందుకు ఎండాయని మాత్రమే అడగ తెలంగాణ లో ఉన్న జలాశయాలు ఇంకా నిండుగా కళకళ లాడుతూనే ఉన్నా అక్కడ కరెంటు ఎందుకు ఉత్ప త్తి కావడం లేదని అడుగుతున్నారు.

కరెంటు కేవలం ఒక్క బొగ్గుతోనే ఉత్పత్తి కాద ని, జలవిద్యుత్‌ కూడా ఉంటుందన్న సంగతి ఎ ప్పుడో తాతాల కాలం కిందటే కనిపెట్టారు. అది కనిపెట్టిన నాడే శ్రీశైలంలో, నాగార్జునసాగర్‌లో ప్రాజెక్టులు కట్టి, నీళ్లను నిల్వ చేసి అక్కడ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చే సి బొగ్గు నిలిపేస్తే ఆ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్‌ ఎం దుకు ఉత్పత్తి చేయడం లేదని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నిలదీసే సరికి ఇప్పుడు ఆయన నీళ్లు నమలాల్సి వస్తోంది. అలాగే సమైక్యాంధ్ర మిథ్యావాద సృష్టికర్త లగడపాటి రాజగోపాల్‌ తన ల్యాంకో కంపెనీ నుంచి రోజుకు మూడు వందల యాబై మెగావాట్ల విద్యుత్తును పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటుంటే ప్రభుత్వం ఎం దుకు చూస్తూ ఊరుకున్నదని కూడా వాళ్లు అడు గుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవరూ ఊక దంపుడు మాటలు మాట్లాడరు. అందులో తెలం గాణ విద్యుత్‌ ఉద్యోగులు మెరుపు తీగలు. వాళ్లు కేవలం కరెంట్‌ మాత్రమే కాదు అవసరమైనప్పు డు షాక్‌ కూడా ఇవ్వగలరు.

బొగ్గు గనులు మూతపడినా కరెంటుకు కష్టం ఉండదని, ప్రత్యామ్నాయంగా జలవిద్యుత్‌ వాడవ చ్చన్నది మన విద్యుత్‌ ఉద్యోగుల వాదన. మన రా ష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలతో రోజు కు అరవై అయిదు మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు కే వలం ఆ ఉత్పత్తిని ముప్పై మిలియన్లకే పరిమితం చేసి కృత్రిమ కొరతను సృష్టించి తెలంగాణలో రై తులకు ఇవ్వాల్సిన కరెంట్‌లో కోత విధించింది. అట్లా పొలాలను ఎండబెట్టి, పంటనష్టం చేసే పా పపు పనికి ప్రభుత్వమే ఒడిగట్టింది. అంతేకాదు జలాశయాలు నిండుగా ఉంటే సీమాంధ్రలో మూ డో పంటకు వాడుకోవచ్చన్నది ఆ కుట్రలో అసలు ఎత్తుగడ. ఇవాళ తెలంగాణలో వరిచేన్లు పొట్టకొ చ్చే కాలంలో నీళ్లు అందకుండా చేయడం గర్భస్రా వాన్ని మించిన దుర్మార్గం. ఈ ఎత్తుగడలో మరో కోణం, తెలంగాణ రైతుల పంటలు చంపేసి ఆం ధ్రా పరిశ్రమలను కాపాడుకోవడం.

గడిచిన పదేళ్లలో ఎంత కరెంట్‌ కొరత ఉన్నా రైతులకు ఇచ్చే కనీస కరెంట్‌లో కోత విధించకూ డదని, కొరత మరీ తీవ్రంగా ఉంటే ముందు గృ హ అవసరాలకు, ఆ తరువాత వాణిజ్య అవసరా లకు ఇచ్చే కరెంట్‌ను క్రమబద్ధీకరించే విధానాన్ని ప్రభుత్వం పాటిస్తోంది. అది మరీ ఎక్కువైనప్పుడు పరిశ్రమలకు ‘పవర్‌ హాలిడే’ ఇవ్వడం ఈ విధా నంలో భాగం. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కాదు రైతు వ్యతిరేకి అన్న అపప్రద మూటగట్టుకున్న చంద్రబాబుపాలనలో కూడా ఈ పద్ధతి పాటించా రు. కానీ ఈ సారి నేరుగా ఒక్క తెలంగాణ ప్రాం తంలోనే రైతులకు, గ్రామాలకు కరెంట్‌ కోత వి ధించడం వెనుక ప్రతీకార ధోరణితో కూడిన కుట్ర దాగి ఉన్నదని అర్థమౌతోంఇ. పరిశ్రమలకు ‘పవ ర్‌ హాలీడే’ ఇస్తే ఆంధ్రా పెట్టుబడిదారులు, పారి శ్రామిక వేత్తలు నష్టపోతారు.

కాబట్టి ఇప్పుడాయన విద్యుత్‌ విధానాన్ని తిర గరాస్తున్నారు. ‘మీరు సమ్మె చేస్తున్నారు. కాబట్టి మీరే నష్టపోవాల’న్నది ఆయనిప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నారు. అయితే సీమాంధ్ర లో ‘క్రాప్‌’ హాలిడే పేరుతో సమ్మె చేస్తున్న రైతుల తో ముఖ్యమంత్రి చర్చపూందుకు జరిపారు. నిజా నికి తెలంగాణ రైతులు సీమాధ్రలో మాదిరిగా పొ లాలను రొయ్యల చెరువులో, చేపల చెరువులో చే సుకుని సొమమ చేసుకుంటూ, పంటలు పండిం చకుండా ప్రభుత్వానికి ధాన్యం కొరత సృష్టిస్తామ ని బెదిరించలేదు. అలా బెదిరించిన కోస్తా రైతుల కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీ వేసి వారంలో ని వేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు వాళ్లకు పరిహారం, ప్యాకేజీలు ప్రకటించడానికి సిద్ధపడు తూ తెలంగాణ రైతుల మీద కత్తి గట్టడానికి కా రణాలను అడగాల్సి ఉంది.

నిజంగానే ముఖ్యమంత్రికే ఏడు చేపల కథ లో చీమ చెప్పిన తార్కికత, త్వాతికత అర్థమైనట్టు లేదు. సీమాంధ్ర పాలకులు ఇలా కుయక్తులతో తె లంగాణ బంగారు పుట్టలో వేలు పెట్టి కకావికలం చేసినందువల్లనే అర్థశతాబ్ద కాలంగా చీమలు తిర గబడుతూ చస్తూ వస్తున్నాయి. ఇవాళ చలి చీమ లు దండు కట్టి తిరుగుబాటు చేస్తున్నాయి. అందు కే సకల జనుల సమ్మెను చూసిన ఎవరికైనా అది ఎంతటి సాహసోపేతమైన తిరుగుబాటో అర్థమౌ తుంది. క్షురకులు, రజకులు మొదలు ఉన్నతాధి కారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు కదులు తున్నారు. అటువంటప్పుడు మూటాలలోకి వెళ్ల కుండా కేవలం ‘చేపా చేపా ఎందుకు ఎండలేద’ని అడిగి ఆగిపోతే కథ అక్కడితో ముగిసి పోతుంద నుకుంటే అంతకుమించిన అతితెలివి ఇంకేముం టుంది ? ముఖ్యమంత్రి చూడడానికి అమాయకు డిలాగే కనిపిస్తారు. ఎలాంటి భావోద్వేగాలు లేని చిరునవ్వు పులుముకుని వచ్చీరాని తెలుగులో తడ బడుతూ మాట్లాడే అతన్ని నిజంగానే అమాయకు డనుకుంటే పొరపాటే.

అతని కవళికలు, కదలికలే కాదు మాటలో తత్తరపాటు గమనించిన వారికి అతని మనసుకూ మాటకు పొంతన లేదన్నది తెలిసిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సకల జనుల సమ్మె ప్రారంభమై తెలంగాణ సమరోధృతి పెరిగిన తరువాత ఆయన పత్రికల వారితో తను చెప్పదలుచుకున్నది చెప్పే శారు. విలేకరులు ప్రశ్నలు అడగొద్దని హుకుం జారీ చేశారు. ఎప్పుడైనా, ఎవరితోనైనా సంభాష ణ మొదలుపెడితే చాలా ప్రశ్నలు అడుగుతారు. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెపితే అసలు రంగు బయటపడుతుంది కా బట్టి అతి తెలివి గలవాళ్లు అలా ప్రశ్నలు అడగ డాన్నే అడ్డుకుంటారు. ముఖ్యమంత్రి కూడా అదే చేశారు. కానీ పత్రికల వారితో చెప్పిన విషయాల్లో నే ఆయన తానేమిటో, తన కార్యాచరణ ఏమిటో స్పష్టపరిచారు. సింగరేణి కార్మికుల సమ్మెతో కరెం ట్‌ ఉత్పత్తి ఆగిపోతుందని, దీనితో మీ ప్రాంత రైతుల పంటలే ఎండిపోతాయని, విద్యాసంస్థల బంద్‌ వల్ల మీ పిల్లలే నష్టపోతారని, పరీక్షలు అడ్డు కుంటే మీ పిల్లలకే ఉద్యోగాలు రావని చెప్పారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘మా”మీ’ అంటూ మాట్లాడ డమే విభజించి పాలించే ఆలోచనకు నిదర్శనం.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ తాను సీమాంధ్ర సీ ఎంను అనుకుంటున్నాడు. అసలు ఆయన ముఖ్య మంత్రిగా ఉన్నాడంటే అది తెలంగాణ ప్రజల చలవ. తెలంగాణ నుంచి ప్రజలు గెలిపించిన 53 మంది శాసన సభ్యుల మద్దతు వల్లే ఆయన ము ఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ వాళ్లం తా గెలిపించిన ప్రజలకంటే కిరణ్‌కుమార్‌రెడ్డికే వి ధేయులుగా వుంటున్నారు. అదే సీమాంధ్ర నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ మీద గెలిచిన 102 మందిలో ఇ ప్పటికే సగం మంది జగన్‌కు ప్రత్యక్షంగానో పరో క్షంగానో జెండా ఎత్తేశారు. అలాంటి వ్యక్తి ‘మీరు, మేము’ అని మాట్లాడడం అతన్ని నిలబెడుతున్న శాసనసభ్యులే కాదు, వాళ్లను గెలిపించిన ప్రజలం దరినీ అవమానించినట్టే లెక్క.

అవమానం అని కేవలం మాటవరసకు అన్న ది కాదు. ఆయన ఆ పనిని ప్రత్యక్షంగా చేస్తున్నా డు. తెలంగాణ సమ్మె విషయంలో తప్పుడు నివేది కలు ఎందుకు పంపిస్తున్నావని అడిగినందుకు పొ న్నం ప్రభాకర్‌ను ‘బుద్ధి లేకుండా ఏం మాట్లాడుతు న్నావ్‌’ అని గదమాయించాడు. ప్రభాకర్‌ను గతం లో కూడా ఒక సభలో జై తెలంగాణ అని నినదిం చినందుకు ‘ఒక్కసారి గెలిస్తే హీరో అయిపోయిన ట్టా’ అని కూడా అవమానించాడని విన్నాం. నిజ మే ఒక్కసారి గెలిచిన ప్రజలతో ఉన్నాడు కాబట్టి ఇక్కటి ప్రజలకు ప్రభాకర్‌ హీరోనే. పొన్నం ప్రభా కర్‌కు పదవి దొడ్డి దారిలోనో, వారసత్వంగానో రాలేదు. అతను కిరణ్‌ రెడ్డిలా దశాబ్దాలుపాటు రా జ్యం ఏలిన రాజకీయ నాయకుడి కొడుకో, శ్రీధర్‌ బాబులా స్పీకర్‌ కొడుకో కాదు. వాళ్ల తల్లిదండ్రు లు సాదాసీదా కల్లుగీత కార్మికులు. అతని ఎదుగు దల వెనుక ఇరవై ఐదేళ్ళ పోరాటం, శ్రమా ఉన్నా యి. సమస్యలు అనుభవించి సమాజం అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్లే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల్లో ఎక్కువగా ఉన్నందుకే ఇప్పుడు పార్లమెం టులో ఆ మాత్రం తెలంగాణవాదం వినిపిస్తోంది.

అతనొక పార్లమెంటు సభ్యుడని కూడా చూడ కుండా అవహేళన చేయడం దొరతనం అయితే అవ్వొచ్చేమా కానీ రాజనీతి కాదు. అలాగే తెలం గాణ మీద ఎన్నడూ బహిరంగంగా నోరు మెదప కుండా, అతని సొంత నియోజక వర్గం యువకు డు యాదిరెడ్డి ఆయన ఉండే ఢిల్లీ వాకిట్లో ఆత్మా ర్పణం చేసుకున్నా చలించని వ్యక్తి జైపాల్‌ రెడ్డి. పాపం గుట్టు చప్పుడు కాకుండా తన పదవిని కా పాడుకుంటున్న సీనియర్‌ కేంద్ర మంత్రి అతను ! అలాంటి వ్యక్తిని కూడా అదనపు గ్యాస్‌ అడిగితే ఆ దుకోలేదని నిందించడం. తెలంగాణ ఎంపీలు అ తన్ని అడ్డుకున్నారని ఆడిపోసుకోవడం ఎంత వర కు సమంజసం? కిరణ్‌కుమార్‌ రెడ్డి కేవలం మా టలతోనే కాదు చేతలతో అంతకుంటే ఎక్కువగా తెలంగాణవాదాన్ని తిప్పికొట్టే పేరుతో ఈ ప్రాంతా నికి అన్యాయం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ము ఖ్యమంత్రిగా ఆయన కొన్ని ప్రయత్నాలు చేసి ఉం డాల్సింది. తెలంగాణ ప్రాంత మంత్రులతో సమ స్యను చర్చించాల్సింది.

ఈ ప్రాంత ప్రజలను అంతో ఇంతో నమ్మించ గలుగుతున్న పార్లమెంటు సభ్యుల సహకారం కో రాల్సింది. కనీసం అఖిల పక్షాన్ని పిలిచి పరిస్థితు లు చర్చించి, సమస్య పరిష్కరించాలని కేంద్రానికొ క లేఖ నైనా రాసి ఉండాల్సింది. లేదా సమ్మెకు ముందస్తుగానే నోటీసు ఇచ్చిన వారిని పిలిపించి మాట్లాడాల్సింది. పరిష్కారం తన చేతుల్లో లేదని, ఢిల్లీ స్పందించడం లేదని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి గడవు అడగాల్సింది. ఇవన్నీ ప్రజాస్వామిక పద్ధతులు. ఇవి వదిలేసి ఆయన తె లంగాణతో అమీ తుమీ తెల్చుకోవాలన్నంత కసి తో వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్‌ నేతలే చెపుతు న్నారు. ఆయన ‘ఎవ్వరి మాటా వినాల్సిన పనిలేద’ న్న ధోరణితో ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వారు వాపోతున్నారు.

అదే నిజమైతే నియంతలు ఎంత బలవంతులైనా ప్రజాస్వామ్యంలో ఎక్కువకాలం నిలబడలేరన్నది సత్యం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించే మార్గాలు వెతకకపోగా సమ్మెను తుపాకి గొట్టం ద్వారా అణచివేయడానికి అదనపు బలగాలు ఇవ్వాలని కోరాడు. ఇప్పుడు సమ్మె చేస్తోన్న ఉద్యోగులపైకి పోలీసులనే కాదు, ప్రజలను కూడా ఉసిగొల్పాలన్నది ఆయన ప్రణాళికని అర్థమౌతోంది. అందుకే ఆయన తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన కరెంటు ఆపేశారు. ‘బొగ్గు లేదు కాబట్టి కరెంటు తయారు కాలేద’ని ఆయనిప్పుడు తెలంగాణ రైతులకు కాకమ్మ కబుర్లు చెపుతున్నారు. ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం సృష్టించి సమ్మె చేస్తోన్న సకల జనులను అణచివేయాలన్న కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని జేఏసీ అంటోంది.

సొంత మంత్రుల విజ్ఞప్తులను, పార్టీ తెలంగా ణ పెద్దల సూచనలను పెడచెవిన పెట్టి ఆయన ఏ పీపీఎస్‌సీ పరీక్షలు నడిపిస్తున్నాడు. రవాణా స్తం భించి దాదాపు సగం మంది పరీక్షలు రాయలేక పోయారు. ఇది నిరుద్యోగుల మీద కక్ష సాధింపు కాక ఏమౌతుంది? ఆంధ్రాలో సమ్మెలేదు, అక్కడ అంతా ప్రశాంతంగా పరీక్షలు రాస్తుంటే ఇక్కడి విద్యార్థులు నష్టపోతారు. అలా నష్టపోయిన వా ళ్లో, లేక దాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగాల ని, కేంద్రంలో చిన్నచితకా పదవిని పొందాలని ఆ శ పడుతున్న వాళ్ళో సమ్మె మీద విరుచుకుపడాల న్నది ప్యూహమైతే అయివుండవచ్చు. కానీ అది ప్ర భుత్వమే చేస్తే అంతకుమించిన ప్రజాద్రోహం ఇం కొకటి ఉండదు.

తెలంగాణ డిమాండు రాజ్యాంగబద్ధమైన హ క్కు మాత్రమే కాదు. న్యాయబద్ధమైన ఆకాంక్ష పై గా అది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా. అటు వంటి సమస్యను పరిష్కరించకపోగా, ఆ బాధ్యత ను గుర్తు చేస్తోన్న వారిని భయబ్రాంతులకు గురి చేయడం, వారిని శత్రువులుగా ఎంచి ప్రతీకార చ ర్యలకు పూనుకోవడం ప్రజాస్వామ్యంలో దుస్సాహ సం. ఇప్పుడాయన దూకుడుతోనే పాలన మీద ప ట్టు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అసలైతే ఉద్య మకారులు దూకుడుతో ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఉద్యమకారులు పరిమితికి మించిన స హనాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ పౌరులు ఉ ద్యమంలో ఎంత పరిణతిని ప్రదర్శిస్తున్నారంటే ప్ర జలంతా రైల్‌కోరోకు కొనసాగించాలని పట్టుబట్టి నా చెప్పిన మాట ప్రకారం గంటకొట్టినంత ఠంచ నుగా పట్టాల మీది నుంచి లేచారు.

జేఏసీ తాము ఇంకా గాంధీ గిరికే కట్టుబడి ఉన్నామని అంటోంది. ఇప్పుడు మనల్ని పాలిస్తో న్న వాళ్లకు గాంధీ మీదే నమ్మకం లేదు. వాళ్ళు ‘గాంధీగిరి’ని గౌరవిస్తారని నేననుకోను. అలా ఉం డి ఉంటే, ‘సమ్మె లేనేలేద’ని ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్‌ పెద్దలు దబాయించే అవకాశం లేదు. వా ళ్లకు సెగ తగలాలంటే ఉద్యమం ఇంకో దశకు చే రాలి. ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబో తోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతా ల గురించి ఆలోచించడం లేదు. అయినప్పటికీ వచ్చే నెలలో పండగలున్నాయి. కాబట్టి జీతాలి ప్పించే బాధ్యత అధికారంలో ఉన్న మంత్రులు తీ సుకోవాలి. అలా జరగని పక్షంలో ఒకటో తారీఖు న వాళ్ళంతా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉ ద్యమంలో భాగస్వాములు కావాలి.

ఉద్యమం ఈ విడత తెలంగాణ కాంగ్రెస్‌ ల క్ష్యంగా కదలాలి. కూలిపోతున్నామన్న బలమైన సంకేతం అందితే తప్ప కుర్చీల మీద ఉన్న వాళ్లు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళను కది లించగలిగే కొత్త ఆయుధం ఒకటి కావాలి.

-మధు పోకల