తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తుదిమెరుగులు

` విభాగాల వారీగా సీఎం సమావేశాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వివిధ విభాగాల వారీగా సవిూక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట్‌ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. మంగళవారం నుంచి నవంబర్‌ 30 వరకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో వరుసగా ఈ సవిూక్ష సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు వరుసగా జరిగే అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సవిూక్షలో సంబంధిత మంత్రులు పాల్గొంటారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం సీఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బుధవారం మౌలిక వసతులు, అభివృద్ధిపై సీఎంతో పాటు మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, మోహమ్మద్‌ అజరుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంబంధిత విభాగాల అధికారులు పాల్గొంటారు. నవంబర్‌ 28న విద్య, యువజన సంక్షేమంపై సాయంత్రం 4 గంటలకు సీఎంతో పాటు మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్‌ వెంకటస్వామి, సంబంధిత విభాగాల అధికారులతో సవిూక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు టూరిజం, టెంపుల్‌ టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ సంబంధిత అధికారులతో సవిూక్షిస్తారు. నవంబర్‌ 29 వ్యవసాయం, సంక్షేమ విభాగాలతో సాయంత్రం 4 గంటలకు: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులుతో సవిూక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ , సీతక్క, మోహమ్మద్‌ అజరుద్దీన్‌ పాల్గొంటారు. నవంబర్‌ 30న ఆరోగ్య రంగంపై సీఎంతో పాటు మంత్రి దామోదర్‌ రాజనరసింహ సంబంధిత అధికారులు పాల్గొంటారు.