తాజావార్తలు
- 13 జిల్లాల్లో పోటాపోటీ పంచాయతీ
- ‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
- ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
- సిట్ ఎదుట వెంటనే లొంగిపోండి
- గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం
- లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి
- పట్టణ సమస్యలు పరిష్కరించండి
- కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…
- భారత్ ఊహల్లో తేలొద్దు
- మరిన్ని వార్తలు
జనం సాక్షి , కమాన్ పూర్ : ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి మంథని ప్రాంతానికి వారబంది ప్రకారం నీటిని విడుదల చేయవలసి ఉండగా శుక్రవారం రాత్రి నుండి ఎస్సారెస్పీ డి – 83 పరిధిలోని 31 ఎల్ కు నీటి సరఫరా ఆగిపోవడం జరిగింది. తక్షణమే జూలపల్లి రైతులు కమాన్ పూర్ మండలానికి సంబంధించిన రైతులు, ములకలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అందరితో కలిసి కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ వైనాల రాజు ఆధ్వర్యంలో 31 ఎల్ కాల్వ వద్దకు శనివారం చేరుకొని అక్కడి నుండి ఇరిగేషన్ శాఖ ఈఈ బలరామయ్య తో ఫోన్లో మాట్లాడి 31 ఎల్ ఉపకాల్వకు నీటిని విడుదల చేయుటకు ఒప్పించారు. ఇందులో భాగంగా ఏఈ ప్రసాద్, లష్కర్లు ఎస్సారెస్పీ 31 ఎల్ వద్దకు చేరుకొని నీటి విడుదలకు సహకరించారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ ఎంపీటీసీ శవ శంకర్, రైతులు నీర్ల లింగయ్య, బొజ్జ సతీష్ ఎండి తాజుద్దీన్, రామకృష్ణ వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



