ఓయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.  ఓయూ విద్యార్థిని అరుణ మృతికి నిరసనగా నేడు విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.