కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖ: బడిశా నుంచీ దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన  ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.