కస్టమ్స్ అధికారుల పేరుతో చోరి
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కస్టమ్స్ అధికారులమని చెప్పి ఇద్దరు దొంగలు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో తనిఖీలు చేశారు. కౌంటర్లో ఉన్న రూ.1.45 లక్షలతో వారు పరారయ్యారు. మరో ఇద్దరు నిందితులను మాత్రం రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.



