కులం పేరుతో దూషించిన వ్యక్తి నమోదు

జమ్మికుంట టౌన్‌, జూన్‌ 12 (జనంసాక్షి): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన  పసుర గొండ శ్రీనివాస్‌ను భూమి వివాదంలో కులం పేరుతో దూషించినందుకు అదే గ్రామానికి చెందిన మూగల స్వామి పై ఎస్‌సి,ఎస్‌టి కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట టౌన్‌ సిఐ సంకీస వెంకటేష్‌ తెలిపారు.మంగళవారం ఉదయం భూమి హద్దు వద్దకు వెళ్ళిన పసుర గొండ శ్రీనివాస్‌ను ఆసభ్య పదజాలంతో దూషించినట్లు సిఐ తెలిపారు.