కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి
ముంబయి: సబర్బన్ ముంయి సకినాక ప్రాంతంలోని రసాయనాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి కంపెనీకి ఆసుకొని ఉన్న ఓ ఇంటి గోడ కూలింది. ఈ శిథిలాల కింద చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా…. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కార్మాగారంలో పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.


