కోహెడలో రోడ్డుప్రమాదం ఇద్దరి దుర్మరణం

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్వీడ్‌బ్రెకర్‌ వద్ద మోపెడ్‌, మోటారుసైకిల్‌ను ఢీకొనటంతో ఎక్కల వేణు (25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్‌ వ్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చినిపోయారు. వేణు కోహెడ మండలం మైసంపల్లికి, శ్రావణ్‌ వరంగల్‌లోని మాములూరుకు చెందినవారు. శ్రావణ్‌ ట్రాన్స్‌కోలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వేణు ఐవీఆర్పీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. బైక్‌మీద ఉన్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.