చిన్న ఓరుంబాడు లారీ ఢీ కొని ఇద్దరి మృతి
కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరుంబాడు క్రాన్రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ, మోటర్సైకిల్ ఒకదానినొకటి ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృది చెందారు. వారి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.