తెలంగాణ కోసం మరో ఉద్యమానికైనా సిద్ధం : టీఎన్జీవో నాయకులు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి ఉద్యమం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవో నాయకులు స్పష్టం చేశారు. 42 రోజుల పాటు అభివర్ణించారు. సకల జనుల సమ్మెపై వెల్లువెత్తిన వ్యాసాల సమాహారంతో రూపొందించిన సకల జనుల సమ్మెపై వెల్లువెత్తిన వ్యాసాల సమాహారంతో రూపొందించిన ‘ సకల జనుల సమ్మె పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రచయితల వేదిక, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ పాల్గొన్నారు. సకలజనుల సమ్మె తర్వాత తెలంగాణ రాకపోవడానికి తెలంగాణ ప్రజాప్రతి నిధులే కారణమని వారు విమర్శించారు.