తెలంగాణ పల్లెలకు విద్యుత్ నిలిపివేసిన :సర్కార్
హైదరాబాద్: ఇవాళ తెలంగాణ మార్చ్ నేపథ్యంలో తెలంగాణ పల్లెలకు సీఎం కిరణ్కుమార్రెడ్డి సర్కార్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. మార్చ్కు రాలేనివారు టీవీల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు వీలు లేకుండా సర్కారు కుట్ర పన్నిందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఎక్కుడ ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు సర్కార్ విద్యుత్ సరఫరా నిలిపివేసిందని వారు అంటున్నారు. తాము సహనం కోల్పేయేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. మధ్యాహ్నంలోగా కరెంట్ను సరఫరా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.