13మంది సజీవ దహనం
బ్యాంకాక్,ఆగస్ట్5(జనంసాక్షి): థాయ్లాండ్లోని ఓ నైట్క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్స్పాట్ నైట్క్లబ్లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తానికి మంటలు విస్తరించడంతో 13 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే నైట్క్లబ్ మొత్తం కాలిపోయింది.
కాగా, అగ్నిమాపక శాఖ విడుదల చేసిన వీడియోలో నైట్క్లబ్ నుంచి కొంత మంది పరుగులు తీస్తూ
కనిపించారు. వారికి మంటలు అంటుకోవడంతో తాళలేక అటూఇటూ పరుగెడుతూ ఉన్నారు. అయితే క్లబ్లోని గోడలకు ఉన్న రసాయనాల వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, వాటివల్ల మంటలను అదుపుచేయడానికి చాలా సమయం పట్టిందని అధికారులు తెలిపారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని వెల్లడిరచారు.
థాయి నైట్కల్బ్లో మంటలు
Other News
- మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
- మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
- పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
- రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్
- బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ..... జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ ఈ యాస్మిన్ భాష
- యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్