దరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

హైదరాబాద్‌:  మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి  మిశ్రమస్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరాఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో  దుకాణాలు కేటాయింపునకు  మరోసారి ప్రకటన విడుదల చేస్తామని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు కోసం పోటీ తీవ్రంగా వుందని వారు  తెలియజేశారు.