నిమ్స్ ఆసుపత్రిని ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి:ఆజాద్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిని దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ నిమ్స్ ట్రామాకేర్లో మెరుగైన వైద్యసేవల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రూ.125కోట్ల వ్యవయంతో విశాఖ, కర్నూల్లో రీజినల్ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.



