నేడు డాక్టర్స్‌ డే

వైద్యో నారాయణో హరి అన్న నానుడి నిజం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరం తర సేవలకు ఈ మాత్రం గుర్తింపు చాల దేమా! ప్రతి వృత్తీ దేనికదేీ సాటి అయిన ప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్లిన నిరంతర వారికి ప్రాణం పొసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది. నిబ్దత , త్యాగనిరతి వైద్యుల కు ఉండాలి. తమ వ్యకిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటుకే ప్రాధాన్యమివ్వాలి. ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడేవాడే నిజ మైన వైద్యుడు. మానవ సేవే మాధవ సేవ అన్న ట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉంటే అంతటి గొప్ప వ్యక్తిగా గుర్తింపు, డాక్టర్లకు సహనం,ఓర్పు ,సేవానిరతి, దయ ఉండాలి. అప్పుడే రాణిస్తారు. వైద్యుడు ఎల్లప్పుడు ఎయిర్‌ (ఏఐఆర్‌) నుసరించాలి: ఎ- అంటే అవైలబిలిటీ అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలి, ఏ అత్యవసర పరిస్థితినైనా తనకు వైద్యం చేసే డాక్టర్‌ అందుబాటులో ఉన్నాడన్న , ఉంటాడన్న నమ్మకం రోగికి కలిగిగేటట్లు వైద్యులు మెలగాలి. ఐ – అంటే ఇంటరెస్ట్‌. తను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అభిరుచి , నమ్మకం ఉండాలి. ఏదో జీవనోపాధి కోసం పని చేయకూడదు. ఆర్‌- అంటే రెగ్యులారిటీ. తను చేస్తున్న పని ఒక క్రమ బద్దత ఉండాలి. నిర్దిష్టమైన టైంటేబుల్‌ ఉండాలి. ప్రతి డాక్టరూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు రోగికి మం చి చేయాలని ఆలోచిస్తాడు. ఫీజు తీసుకున్నా .. తీసుకోకపోయినా తను చేసే సేవ ఒకేలా ఉంటుంది. రోగికి, వైద్యునికి మధ్య నమ్మకం అనేబంధం కలిగి ఉండాలి.
వైద్యుల కోసం ఒక రోజు
అనుక్షణం ఆరోగ్యాన్ని,శరీరక, మానసిక స్థయిర్యాన్ని అందించే ఈ వైద్య నారాయణులకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? డాక్టర్‌ చికిత్స చేసే శాడు-రోగి ఫీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణం తీరిపోతుందా? ఆ బంధం తెగి పోతుందా? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణం కృతజ్ఞతను నింపుకునే పదేపదే గుర్తు చేస్తూ ఉండరూ ?…అందుకే ఈ వైద్యులకు కోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించింది.. అదే ప్రపంచ డాక్టర్స్‌ డే . వాళ్లను గుర్తు పెట్టు కునేం దుకు ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతో షాలు, ఆయురోగ్యాలు, సిరి సంపదలతో చల్లగా ఉండాలని దేవుని ప్రార్థించి శుభాకాంక్షలు తెలియ జేస్తారు. అలా తెలియజేసేందుకు సంవత్సరంలో ఒక రోజు.
డాక్టర్స్‌ డే చరిత్ర
1993 మార్చి 30న జార్జియలోని విండార్‌ లో తొలిసారిగా డాక్టర్స్‌ డే పాటించారు. డా. చార్లెస్‌ బి. ఆల్మండ్‌ భార్య బ్రౌన్‌ ఆల్మండ్‌ వైద్యుల గౌరవార్ధం ఒక రోజు కేటాయించాలని నిర్ణ యించారు. గ్రీటింగ్‌ కార్డులను పంపడం, అసు వులు బాసిన వైద్యులకు పూలతో నివాళ్పుల ర్పిం చడం ద్వారా తొలి డాక్టర్స్‌ డే ఉత్సవం జరిపారు. జాతీయ డాక్టర్స్‌ డే నాడు ఎర్రని కార్నేషన్‌ పువ్వు లను సాధారణంగా వాడేవారు. యునైటెడ్‌ స్టేట్స్‌ లో ప్రతినిధుల సభ డాక్టర్స్‌ డే పాటిస్తూ 1958 మార్చి 30 వ తేదీన చేసింది.
1990లో నేషనల్‌ డాక్టర్స్‌ డే పాటించాల్సిందిగా చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1990 అక్టోబర్‌ 30న అధ్యక్షుడు జార్జిబుష్‌ మార్చి 30న ‘నేషనల్‌ డాక్టర్స్‌ డే’ గా పేర్కొంటూ చట్టం పై సంతకం చేశారు. మన దేశంలో ప్రతియేటా జూలై 1న నేషనల్‌ డే ని జరుపుకుంటున్నాం. ప్రముఖ వైద్యు డు డా. బీసీ రాయ్‌ గౌరవవార్థం ఈ రోజు న నిర్ణ యించారు. ఈయన 1882 జూలై 01 న జన్మిం చారు. మన దేశంలొ వైద్య రంగా నికి ఎనలేని సేవలందించిన బీసీ రాయ్‌ గౌర వర్థాం ఆయన జన్మ దినాన్ని డాక్టర్స్‌ డే పాటిస్తున్నారు. డాక్టర్‌ బీసీ రాయ్‌ పుట్టినరోజు ..మరణించిన రోజు ఒక్క రోజు .. జూలై ఒకటో తేదీ కావడం విశేషం. ఆయన 1962 జూలై ఒకటో తేదీన పొయాడు .
డాక్టర్స్‌ బి.సి. రాయ్‌ 1882 జూలై ఒకటవ తేదీన బీహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బకిమ్‌ లో జన్మించారు. ఈయన పూర్తిపేరు బిధాన చంద్ర రాయ్‌.తండ్రి ప్రకాశ్‌ చంద్ర.ఎక్త్సెజ్‌ ఇన్‌స్పెక్టర్‌. బీసీ రాయ్‌ తోబుట్టు వులు ఐదుగురు తన 14 వ యేట తల్లిని కొల్పో యారు. అవివాహితుడైన బీసీ రాయ్‌ తన ఆస్తు లతో పాట్నాలో ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సామాజిక సేవలకు అంకితం చేశారు..
బీసీ రాయ్‌ 1909-11 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ లోని సెంట్‌ బెర్త్‌ లో ఎమ్మార్సీపీ, ఎఫ ్‌ఆర్సీఎస్‌ డిగ్రీలు పొందడానికి చదువు కొన సాగించి 1911లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోలోకతా మెడికల్‌లో కొంతకాలం అధ్యా పకుడిగా పనిచేశారు. ఈయన జాదవ్‌పూర్‌ టీబీ హాస్పిటల్‌ , ఆర్జీ ఖార్‌ మెడికల్‌ కాలజీ ,కమలా నెహ్రూ హాస్పిటల్‌ ,విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌ , చిత్త రంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ మొదలైన సంస్థలు నెలకొల్పాడు. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల చిత్తరంజన్‌ సేవా సదన్‌ అనే వైద్య శాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్‌ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థమా ఏర్పాటు చేశాడు.
1925లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బారక్‌ పూర్‌ అసెంబ్లీ నియెజక వర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ బెంగాల్‌ గా పేరొందిన సురేంద్రనాథ్‌ బెనర్జీని ఓడిం చారు.1922-28 మధ్యకాలం కోల్‌కతా మెడి కల్‌ జర్నల్‌కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వ ర్తించారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా నియామకమయ్యారు. 1993 లో కోల్‌కత్తా నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1942 లొ కొల్‌కత్తా విశ్వ విద్యాయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా, 1943లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా నియమింపబడ్డారు.
విద్యా,వైద్య రంగాల్లో ఈయన సేవలకు 1944లో గౌరవ డాక్టకేట్‌కు ప్రదానం చేశారు. 1948 జన వరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.1961లో ఫిబ్రవరి 4న ఈయన భారత రత్న వరించింది. వీరి జయంతి రోజైన జూలై ఒక టినే వర్ధంతి కూడా కావడమే విశేషం. ఈయన స్మారకార్థం ప్రతీ ఏడూ జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది .వివిధ రంగా ల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్‌ బీసీ రాయ్‌ పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నేటి వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు డాక్టర్‌ బీసీ రాయ్‌.