పాఠశాల బస్సు దగ్థం.. విద్యార్థులు క్షేమం
పెదపూడి: తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పుట్టగొండ-గండ్రేడు రహదారిలో ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు దగ్థమైంది. అయితే ఈ ఘటన నుంచి విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.



