పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్ ఉన నబీ ర్యాలీ పాతబస్తీలోని మక్కా మసీదు నుంచి ఉదయం ప్రారంభమైంది. మొఘల్పురా వరకూ సాగే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.



