పిడుగుపాటుకు ఆరుగురు మృతి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.