ఫిబ్రవరి 1 నుంచి ‘ క్విట్ తెలంగాణ’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నందున ఫిబ్రవరి 1 నుంచి ‘ క్విట్ తెలంగాణ’ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు విద్యార్ధి జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్, అనిల్, బాలరాజు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరుగబోయే సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు.